శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..
మనిషిలో పెరిగిపోయిన స్వార్థం ఎంతకైనా తెగించేలా చేస్తుంది.. ఆఖరికి మృతిచెందిన వారికి కూడా ఆత్మశాంతి లభించకుండా చేస్తున్నారు. మృతదేహాలను ఖననం చేసిన తర్వాత అస్తికలు అపహరిస్తున్నారు. దొంగిలించిన ఆ అస్తికలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ శివారులో ఓ వ్యక్తి స్మశానవాటికలో అస్తికలు దొంగిలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
అతన్ని మందలించి వదిలేశారు. శ్మశాన వాటికలే టార్గెట్ గా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్షుద్ర పూజల ఘటనలు తరచుగా చూస్తున్నాం. క్షుద్ర పూజలలో ఉపయోగించే మనిషి అస్తికలు, పుర్రెను ఖననం చేసిన డెడ్ బాడీల నుండి సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హనుమకొండ శివారు భీమారం శ్మశాన వాటికలో జరిగిన ఘటన.. స్థానికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖననం చేసిన డెడ్ బాడీలను తవ్వి అందులో అస్థికలను పోగుచేసుకొని ప్లాస్టిక్ సంచిలో ఎత్తుకెళ్తుండగా.. స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అయితే అమావాస్యకు ముందు ఈ విధంగా అస్తికలు సేకరించి క్షుద్ర పూజలకు ఉపయోగిస్తుంటారని భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

