ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేయాలనుకునే వాళ్లు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటారు. టిక్కెట్లు తీసుకోకుండానే జనరల్ బోగీల్లో ఎక్కేసి ఎంచక్కా గమ్యస్థానాలకు చేరిపోతుంటారు. పొరపాటున టీసీ రావడం గమనిస్తే మాత్రం అతడి నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. బాత్రూంలో దాక్కోవడమో, పక్క బోగీలోకి పారిపోవడమో, అప్పటికే ఏదైనా స్టేషన్ వస్తే అక్కడ దిగిపోవడమో చేస్తుంటారు.
కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం ఊహకందని రీతిలో రైలు ప్రయాణం చేశాడు. మొత్తం 250 కిలో మీటర్లు దూరాన్ని.. రూపాయి ఖర్చు లేకుండా జర్నీ చేశాడు. కానీ చివరకు అధికారుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంతకీ అతడు ఎలా దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ఎక్స్ప్రెస్ రైలును చూడగానే.. ఓ యువకుడు అందులోకి ఎక్కి ప్రయాణం చేయాలనుకున్నాడు. కానీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆలోచించాడు. టిక్కెట్టు తీసుకోకుండా, టీసీ కూడా గుర్తించకుండా ప్రయాణిస్తే బాగుంటుందని భావించాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా రైలు బోగీ కిందకు దూరాడు. అలా భోగీ కింద ఉన్న ఓ ఇనుప కడ్డీపై పడుకుని ఎవరికీ కనిపించకుండా ప్రయాణం చేశాడు. అయితే రైలు అనేక స్టేజ్ ల వద్ద ఆగినా అతడు మాత్రం రైలు దిగలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు

