ఓర్నీ… అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు… రోగి మాత్రం..

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు. అవేక్‌ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి ఉంటుంది.

ఓర్నీ... అదుర్స్‌ సినిమా చూపించి ఆపరేషన్‌ చేసేసారు... రోగి మాత్రం..

|

Updated on: Sep 23, 2024 | 9:05 PM

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగికి ఈ సర్జరీ జరిగింది. అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు. అవేక్‌ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి ఉంటుంది. దీంతో జీజీహెచ్‌ వైద్య బృందం రోగి సినిమాలో నిమగ్నమై ఉండగా చికిత్స పూర్తి చేశారు. తొండంగి మండలం ఎ కొత్తపల్లికి చెందిన ఎ అనంతలక్ష్మి అనే మహిళకు గత కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆమె తలలో పెద్ద కణితి ఉందని, ఇది ఖర్చుతో కూడిన వైద్యమని, నయం కావడం కష్టమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 11న ఆమెకు తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయి పరిస్థితి విషమించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలా చేస్తే ముఖం మీద మచ్చలే ఉండవు

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది !!

Follow us