ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??
నదులు, కాలువల్లో ఉండాల్సిన చేపలు రోడ్డు మీద ప్రత్యక్షమైతే.. మాంసప్రియులకు పండగే పండగ.. ఇక వందల ఖరీదు చేసే చేపలు ఫ్రీగా దొరికితే జాతరే.. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు.
నదులు, కాలువల్లో ఉండాల్సిన చేపలు రోడ్డు మీద ప్రత్యక్షమైతే.. మాంసప్రియులకు పండగే పండగ.. ఇక వందల ఖరీదు చేసే చేపలు ఫ్రీగా దొరికితే జాతరే.. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో వాటిని ఏరుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన చేపలను ఏరుకుని సంచుల్లో వేసుకుని తీసుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో లైవ్ ఫిష్ కోసం స్థానిక ప్రజలు ఎగబడ్డారు. నదుల్లో ఉండాల్సిన చేపలు నడిరోడ్డుమీద కళ్లెదుట నాట్యం చేస్తుంటే వాటిని చూసిన జనం ఏరుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని అదుపు చేశారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

