AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్‌‌పోర్ట్ కొట్టేశాడట

ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్‌‌పోర్ట్ కొట్టేశాడట

Phani CH
|

Updated on: Aug 20, 2024 | 1:54 PM

Share

లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్‌పోర్ట్‌ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్‌ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్‌ లేఆఫ్‌లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది.

లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్‌పోర్ట్‌ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్‌ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్‌ లేఆఫ్‌లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది. సంస్థను లాభాల పట్టించేందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని గతంలో విశ్వనాథ్ తెలిపారు. ఆ కఠిన నిర్ణయం వెనుక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందని అన్నారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కథనం ప్రకారం.. అమెరికా వీసాతో ఉన్న తన పాస్‌పోర్ట్‌ను ఉద్వాసనకు గురైన ఓ సీనియర్ ఉద్యోగి దొంగలించారని ఝా తెలిపారు. దీంతో స్టార్టప్‌కు నిధులు పొందేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్‌ వచ్చినప్పటికీ.. కొత్త యూఎస్‌ వీసా కోసం చాలాకాలం వేచి ఉండటం వల్ల సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి కామెంట్స్..