ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్పోర్ట్ కొట్టేశాడట
లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్పోర్ట్ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్ లేఆఫ్లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది.
లేఆఫ్ ప్రకటించానన్న కోపంతో తన పాస్పోర్ట్ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈవో ఆరోపించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సార్థి ఏఐ సీఈవో ఈ ఆరోపణలు చేశారు. బెంగళూరుకు చెందిన సార్థి ఏఐను విశ్వనాథ్ ఝా స్థాపించారు. దానికి ఆయనే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతేడాది నిర్వహించిన మాస్ లేఆఫ్లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది. సంస్థను లాభాల పట్టించేందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని గతంలో విశ్వనాథ్ తెలిపారు. ఆ కఠిన నిర్ణయం వెనుక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందని అన్నారు. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కథనం ప్రకారం.. అమెరికా వీసాతో ఉన్న తన పాస్పోర్ట్ను ఉద్వాసనకు గురైన ఓ సీనియర్ ఉద్యోగి దొంగలించారని ఝా తెలిపారు. దీంతో స్టార్టప్కు నిధులు పొందేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ వచ్చినప్పటికీ.. కొత్త యూఎస్ వీసా కోసం చాలాకాలం వేచి ఉండటం వల్ల సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

