East Godavari: ఇంటి ఆవరణలో పెంచిన ద్రాక్ష చెట్టుక విపరీతంగా కాపు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామారెడ్డి దంపతులు పెరట్లో ద్రాక్ష పాదు పెట్టి 15 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరంలో ఎక్కువ నెలలు ద్రాక్ష కాస్తూనే ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాల్లో అరుదుగా కాసే ఈ ద్రాక్ష పెరట్లో విరివిగా కాయడంతో చూసేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారు.
ద్రాక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ద్రాక్షలో పోషకాలు ఎక్కువే. అదీ నల్ల ద్రాక్ష.. తియ్య తియ్యగా.. పుల్ల పుల్లగా భలే ఉంటుంది. అలాంటి ద్రాక్ష పెరట్లోనే గుత్తులు గుత్తులుగా కాస్తుంటే ఆ ఆనందం వర్ణించగలమా. అనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో కొప్పవరం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఇంటి పెరట్లోనే ద్రాక్ష చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాపు వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామారెడ్డి దంపతులు పెరట్లో ద్రాక్ష పాదు పెట్టి 15 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరంలో ఎక్కువ నెలలు ద్రాక్ష కాస్తూనే ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాల్లో అరుదుగా కాసే ఈ ద్రాక్ష పెరట్లో విరివిగా కాయడంతో చూసేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారు. ఇంటి యజమాని భార్య సత్యవేణి ద్రాక్ష పాదుకు పోషణ అందిస్తూ.. ఎక్కవ కాపు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దంపతులు ఇంటికి వచ్చే బంధుమిత్రులకు ముందు తమ ఇంటి ద్రాక్షతో నోటి తీపి చేసి సంగతులు తెలుసుకుంటూ ఉంటారు. తెలిసినవారికి ఇంటికి ద్రాక్షను పార్శిల్ చేసి పంపుతూ ఆనందపడుతున్నారు ఈ దంపతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

