మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో
మనుషులకే కాదు.. ఇక నుంచి మొక్కలకు కూడా ఆధార్ కార్డు లభించనుంది. మొక్కల కోసం “డిజిటల్ ట్రీ ఆధార్”ను ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో పౌరులుగా గుర్తింపుకోసం, ప్రభుత్వ పథకాల లబ్ధిపొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అదే తరహాలో చెట్ల పరిస్థితిపై డేటాబేస్ ను సమీకరించడానికి ‘డిజిటల్ ట్రీ ఆధార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖరా కె మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి.
ముఖరా కె గ్రామంలో ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయించారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మొక్క ఆరోగ్యం, వయస్సు, పెరుగుదల క్రమం, ఆ మొక్క నుంచి ఎంత అక్షిజన్ వస్తుందో తెలుస్తుంది. ఆ వృక్షం ఉన్న నిర్ధిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆ మొక్క లొకేషన్ తెలిసిపోతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి మొక్క బ్రతుకుంది అంటున్నారు మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి. మనిషికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అలాగే మొక్కలకు కూడా డిజిటల్ ట్రీ ఆధార్ ను ఇస్తున్నామని చెప్పారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయించడం తెలంగాణ లోని తొలి గ్రామంగా ముఖరా కె రికార్డులకు ఎక్కుతుందని గాడ్గే మీనాక్షి అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు నాటిన మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయిస్తే నాటిన ప్రతి మొక్క బతుకుతుందని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో
పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

