Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!

ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!

Phani CH

|

Updated on: Sep 01, 2023 | 10:25 AM

చాలామంది పక్షులంటే చాలా ఇష్టపడతారు. వాటిని చూడగానే ఆనందాన్ని పొందుతారు. వాటిని చేరదీసి ఆహారం పెడతారు. దాంతో ఆ పక్షులు కూడా వారికి కృతజ్ఞతగా ఉంటాయి. వారి చుట్టే తిరుగుతుంటాయి. తాజాగా ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయ దంపతులు పక్షుల పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. తెల్లవారితే పక్షుల కిలకిలారావాలతో ఆ ఇల్లు కళకళలాడుతుంటుంది. తల్లి తమకు ఎప్పుడు టిఫిన్‌ పెడుతుందా అని పిల్లలు ఎదురుచూసినట్లు ఆ ఇంటిచుట్టూ పక్షులు ఎదురుచూస్తుంటాయి అంటే అతిశయోక్తికాదు.

చాలామంది పక్షులంటే చాలా ఇష్టపడతారు. వాటిని చూడగానే ఆనందాన్ని పొందుతారు. వాటిని చేరదీసి ఆహారం పెడతారు. దాంతో ఆ పక్షులు కూడా వారికి కృతజ్ఞతగా ఉంటాయి. వారి చుట్టే తిరుగుతుంటాయి. తాజాగా ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయ దంపతులు పక్షుల పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. తెల్లవారితే పక్షుల కిలకిలారావాలతో ఆ ఇల్లు కళకళలాడుతుంటుంది. తల్లి తమకు ఎప్పుడు టిఫిన్‌ పెడుతుందా అని పిల్లలు ఎదురుచూసినట్లు ఆ ఇంటిచుట్టూ పక్షులు ఎదురుచూస్తుంటాయి అంటే అతిశయోక్తికాదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గాంధీనగర్ చెందిన అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఎంతోమంది విద్యార్థులకు దారి చూపారు. ప్రస్తుతం విశ్రాంత సమయంలో వారు పక్షి ప్రేమికులు గా మారిపోయారు. పక్షులకు కడుపునిండా ఆహారం పెట్టిన తర్వాతే వారు తింటారు. వాటిని తమ పిల్లల్లా భావిస్తారు. వాటి కోసం కూడా ప్రతిరోజూ ఆహారం వండుతుంటారు. వారు అన్నం తినే ముందు పక్షులకు ఇంటిముందు గోడపైన అన్నం పెట్టి వారు తింటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్‌ బాహుబలి అంటున్న నెటిజన్లు

మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??

అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్‌.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి

చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు

TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది

Published on: Sep 01, 2023 10:01 AM