AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..

రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..

Phani CH
|

Updated on: Dec 21, 2024 | 11:38 AM

Share

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్లు ఏ దైవ దర్శనానికో... లేదంటే ఏ తిరనాళ్లకో కాదు. వీళ్లంతా కేవలం ఐదు రూపాయలకే బిర్యానీ అని ఓ రెస్టారెంట్ ఓనర్ ప్రకటించడంతో ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్ కంపార్ట్మెంట్ లోకి బారులు తీరారు బిర్యానీ ప్రియులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఐదు రూపాయలకే బిర్యానీ అంటూ ఓ వ్యాపారి ఆఫర్ పెట్టాడు. దీంతో పెద్ద ఎత్తున క్యూ కట్టారు బిర్యానీ ప్రియులు.

దీనికోసం ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి మరి వేడి వేడి బిర్యానీని ఐదు రూపాయలకే ఇచ్చేశారు. నూతన వ్యాపారం కావడంతో రెస్టారెంట్ కి కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూనే ఉంటారు. దీనికి ట్రాఫిక్ పోలీసుల పర్మిషన్ తీసుకుని రూల్స్ పాటించాల్సి ఉంటుంది… ఆ తర్వాత మాత్రమే ఇలాంటి ఆఫర్స్ కి ఛాన్స్ ఇస్తారు పోలీసులు… ప్రస్తుతం రాజమండ్రిలో ఐదు రూపాయలు బిర్యానీకి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు బిర్యానీ ప్రియులు. బిర్యానీ సెంటర్ యాజమాన్యం రాజమండ్రిలో నూతన బ్రాంచ్ లో ఆఫర్ గురించి వారం రోజులుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వైరల్ చేశారు. ఈ వార్త విన్న ఫుడ్ ప్రియులు ఉదయం 9 గంటలకి రెస్టారెంట్ కి చేరుకుని క్యూ లైన్ లో బారులు తీరారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..

ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు

ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం

X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్

ఫ్యామిలీ అంటే మీదేనయ్యా !! నలుగురికీ గిన్నిస్ రికార్డులు