AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి దండ్రులను చంపి.. శవాలతో నాలుగేళ్ళుగా సహజీవనం వీడియో

తల్లి దండ్రులను చంపి.. శవాలతో నాలుగేళ్ళుగా సహజీవనం వీడియో

Samatha J
|

Updated on: Jun 10, 2025 | 1:19 PM

Share

డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు నేటి పిల్లలు అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బ్రిటన్ లో జరిగిన ఒక దారుణ సంఘటన. లండన్ కు చెందిన వర్జీనియా మెక్కల్లు డబ్బు కోసం తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. అంతేకాదు వారి మృతదేహాలను నాలుగు సంవత్సరాలు ఇంట్లోనే దాచి పెట్టింది. 36 ఏళ్ల వర్జీనియా జూన్ 2019లో తన తల్లి లూయిస్ తండ్రి జాన్ మెక్కల్లులను దారుణంగా హత్య చేసింది.

వీరిద్దరికీ దాదాపు 70 సంవత్సరాలు. అయితే తాను చేసిన అప్పులు క్రెడిట్ కార్డుతో చేసిన మోసం బయటపడితే తల్లిదండ్రులు తిడతారనే భయంతో చంపేశానని చెబుతోంది హంతకురాలు. కరోనా లాక్ డౌన్ సాకుతో తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడం పెన్షన్ తీసుకునే ప్రక్రియను కొనసాగించింది. రెండు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి ఆమె తన తల్లిదండ్రుల పేరుతో నాలుగు సంవత్సరాలుగా మెసేజ్ లు పంపుతూనే ఉంది. వారిద్దరూ పర్యటనలో ఉన్నారని అక్కను బంధువులను తప్పుదారి పట్టించింది. ఎట్టకేలకు నిజం బయటపడటంతో హంతకురాలికి వర్జీనియా కోర్టు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే తన తల్లిదండ్రులను చంపిందనే షాక్ నుంచి అక్క చాలా రోజుల వరకు కోలుకోలేకపోయింది.

మరిన్ని వీడియోల కోసం :

“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో

ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో

బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో