అక్కడ తవ్వేకొద్దీ బయటపడుతున్న విగ్రహాలు
జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో దేవుళ్ల శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. గురువారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఇవి బయటపడినట్టు స్థానికులు తెలిపారు. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనుల్లో భాగంగా ఎక్కల దేవి గుట్ట వద్ద కందకాలు తవ్వుతుండగా దేవుళ్ళ శిలా విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో దేవుళ్ల శిలా విగ్రహాలు పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. గురువారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఇవి బయటపడినట్టు స్థానికులు తెలిపారు. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనుల్లో భాగంగా ఎక్కల దేవి గుట్ట వద్ద కందకాలు తవ్వుతుండగా దేవుళ్ళ శిలా విగ్రహాలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఆ విగ్రహాలను శుభ్రం చేసిన మహిళలు పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలతో పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి.. విగ్రహాలను దర్శించుకుంటున్నారు. ఆ దేవుడి విగ్రహాలను చూసిన ఓ మహిళకి పూనకం వచ్చి.. ఊగిపోయింది. వారం రోజులుగా తాను అక్కడే ఉంటున్నట్లు చెప్పింది. తనకు అక్కడే గుడి కడితే అందర్నీ చల్లగా చూస్తానని.. భవిష్యవాణి చెప్పింది. పోచమ్మ, హనుమంతుడు, రాజరాజేశ్వరి దేవి, శివలింగాలు, వివిధ దేవతల విగ్రహాలు అక్కడ బయటపడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రం ఎందుకు.. నీలి రంగులోకి మారింది ??
మొన్న విశాఖ.. ఇవాళ హైదరాబాద్.. డ్రగ్స్కు అడ్డాగా మారిన తెలుగు రాష్ట్రాలు
అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి
చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

