Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

Samatha J

|

Updated on: Mar 02, 2025 | 12:30 PM

విశ్వాసంలో శునకానికి సాటి మరొకరుండరు. అందుకే జంతు ప్రేమికులు ఎక్కువగా శునకాలను పెంచుకోడానికి ఆసక్తి చూపుతారు. ఈ శునకాలు కూడా తమ యజమాని పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాయి. అంతేకాదు తన యజమాని కటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. చాలా మంది పెంపుడు శునకాలను తమ కుటుంబసభ్యల్లో ఒకరిగా భావిస్తారు. వాటికి ఏ చిన్న ప్రమాదం జరిగినా తల్లడిల్లిపోతారు. అందుకు ఎంతటివారైనా అతీతులు కారడనం అతశయోక్తి కాదు.

ఎందుకంటే ఓ మాజీ న్యాయమూర్తి తన పెంపుడు శునకానికి అనారోగ్యం కలగడంతో చిన్నపిల్లాడిలా బోరున విలపించారు. తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్‌ రావు హస్కీ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అందమైన కళ్లతో.. బలిష్టమైన శరీరంతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే ఈ శునకం అంటే ఆయనకు ప్రాణం. ఇటీవల ఆ శునకం అనారోగ్యం బారిన పడటంతో ఆయన తల్లడిల్లిపోయారు. నిపుణులతో చికిత్స చేయించారు. ఎన్నో సపర్యలు చేశారు. అయినా ఆ శునకం అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయింది. ఇంట్లో సభ్యుడిలా ఎప్పుడూ చలాకీగా తిరిగే పెంపుడు శునకం నిస్సహాయంగా పడుకొని ఉండటం చూసి ఆ మాజీ న్యాయమూర్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని వీడియోల కోసం  :

పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా

మస్క్‌ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..

అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో

పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో