Police: ఏఎస్ఐ ఇంట్లో భారీ చోరీ.. దొంగల ఆచూకీ కోసం బాబా సాయం కోరిన పోలీసు అధికారి.వీడియో వైరల్.
సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే... వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్..
సామాన్యంగా ఎవరింట్లోనైనా, లేదా ఏ సంస్థలోనైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఆ పోలీసుల ఇంట్లోనే చోరీ జరిగితే… వాళ్లెవరిని ఆశ్రయించాలి.. వీళ్లకీ రక్షకులు ఉన్నారండోయ్.. వారే బాబాలు. మనదేశంలో బాబాలకు కొదవేముంది చెప్పండి? తాజాగా ఓ పోలీసు అధికారి తన ఇంట్లో చోరీ జరిగితే దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో జరిగింది. డిసెంబరు 23న జరిగిన ఈ ఘటనలో చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. 40 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో ఈ ఏఎస్ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు వివరించి, దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన బాబా.. ఆయన ఈ పోలీసు అధికారికి మంచి క్లూ అయితే ఇచ్చారు కానీ… గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే.. క్లూ మీ పోలీస్ క్వార్టర్స్లోనే ఉందీ.. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని చెప్పి, చివరిలో గ్యారెంటీ లేదని చెప్పారు. అదండీ సంగతి..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
అత్యంత ఎత్తైన రైలు మార్గాన్ని చూశారా
‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత

