Viral: గోదారోళ్లా మజాకా.! అల్లుడికి 408 రకాల వంటలతో విందు.. అదిరిపోయిందిగా.
గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్న మాట తరచు వింటూనే ఉంటాం.ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ.. అంటూ సరదాగా కామెంట్స్ సర్వ సాధారణం. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదోరోళ్ల మర్యాదలు, వంటలు, కొత్త అల్లుళ్లకు ఇచ్చే ఆతిథ్యం గురించి తరచు వీడియోలు కనిపిస్తునే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి పండక్కి ప్రతీ సంవత్సరం అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే. వారు అందించే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే.
గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్న మాట తరచు వింటూనే ఉంటాం.ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ.. అంటూ సరదాగా కామెంట్స్ సర్వ సాధారణం. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదోరోళ్ల మర్యాదలు, వంటలు, కొత్త అల్లుళ్లకు ఇచ్చే ఆతిథ్యం గురించి తరచు వీడియోలు కనిపిస్తునే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి పండక్కి ప్రతీ సంవత్సరం అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే. వారు అందించే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ తన కొత్త అల్లుణ్ణి సంక్రాంతి పండగకు ఇంటికి పిలిచి ఏకంగా 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వారి పెళ్లి జరిగి 408 రోజులు కావడంతో 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. గతంలో వారి వివాహ సమయంలో ఏకంగా రోల్స్ రాయిస్ కారులో ఊరేగించి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. ఇప్పుడు 408 రకాల పిండివంటలతో అల్లుడికి-కూతురికి మర్యాద చేసి మరోసారి గోదారోళ్లా.. మజాకా.. అని అనిపించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

