AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

Phani CH
|

Updated on: May 10, 2024 | 1:31 PM

Share

ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పంప్‌ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పంప్ హౌజ్‌లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుల దోపిడీకి పాల్పడ్డారు. సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు, కత్తులతో బెదిరించి దొరికినకాడికీ దోచుకుని పారిపోయారు. దొంగతనాలలో మంచి ఎక్స్ట్‌పర్ట్స్‌లా బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు బెండల్స్ కాపర్ వైర్లు, కొన్ని ఇనుప రాడ్లు ఎత్తుకెళ్లారు.

ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పంప్‌ హౌస్‌లో భారీ చోరీ జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని పంప్ హౌజ్‌లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుల దోపిడీకి పాల్పడ్డారు. సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కర్రలు, కత్తులతో బెదిరించి దొరికినకాడికీ దోచుకుని పారిపోయారు. దొంగతనాలలో మంచి ఎక్స్ట్‌పర్ట్స్‌లా బిల్డప్ ఇచ్చిన ఈ ముఠా ఏం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు బెండల్స్ కాపర్ వైర్లు, కొన్ని ఇనుప రాడ్లు ఎత్తుకెళ్లారు. వారు చోరీకి పాల్పడ్డ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.. పంప్ హౌజ్ సిబ్బంది ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం దేవాదుల పంపౌజ్ లో ఈ చోరీ జరిగింది. అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని దుండగులు.. పంప్‌ హౌస్‌ వద్ద అర్ధరాత్రి నిద్రలో ఉన్న సిబ్బందిని లేపి కర్రలు, కత్తులతో బెదిరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే

Maldives: మీరొస్తేనే మేం బతకగలం.. దిగొచ్చిన మాల్దీవులు !!

దడ పుట్టిస్తోన్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా ఉపయోగం లేదా

నిమిషాల్లో వజ్రాలు తయారీ.. ఎక్కడంటే ??