Shamshabad: శంషాబాద్లో గుప్తనిధుల కలకలం.! ఓ ఫామ్హౌస్లో 20 అడుగుల మేర తవ్వకాలు
హైదరాబాద్ లోని శంషాబాద్లో గుప్తనిధుల ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాదాపు 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. అనంతరం అక్కడ కొబ్బరికాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. తవ్వకాలు జరిగినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్ లోని శంషాబాద్లో గుప్తనిధుల ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాదాపు 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. అనంతరం అక్కడ కొబ్బరికాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. తవ్వకాలు జరిగినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చార్మినార్కి చెందిన అక్తర్ అనే వ్యక్తికి చెందిన ఫామ్హౌస్లో తవ్వకాలు జరిపారు. లోపల పూజలు జరిపిన ఆనవాళ్లను గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మట్టి రంగు మారడంతో ఏమై ఉంటుందా అని తవ్వకాలు జరిపినట్టు అక్తర్ తెలిపాడు. ఈ తవ్వకాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

