భూమిని తవ్వతుండగా భాకీ శబ్ధం.. ఏంటా అని వెలికితీయగా అద్భుతం
జమ్మూ కాశ్మీర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్ధారించింది.
జమ్మూ కాశ్మీర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బుద్గామ్ జిల్లాలో 2 పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్ధారించింది. బుద్గామ్లోని గుడ్సథూ గ్రామంలోని వ్యక్తులు ఓ స్థలంలో తవ్వకాలు జరుపుతుతండగా.. ఓ శిల్పం కనిపించింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిల్పాన్ని స్వాధీనం చేసుకుని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ బృందాన్ని పిలిపించి విగ్రహాన్ని పరిశీలించగా, ఆ శిల్పం విష్ణుమూర్తిది అని తేలింది. ఈ విగ్రహం దాదాపు 9వ శతాబ్దానికి చెందినదని.. దాదాపు 1,200 సంవత్సరాల క్రితం నాటిదని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ శిల్పం మూడు తలలతో.. నాలుగు చేతులతో ఉంది. విగ్రహం కుడి చేయి ఎగువ భాగంలో కమలం ఉంది. అదే విధంగా బుద్గాంలోని ఖాగ్ ప్రాంతంలో మరో శిల్పాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు శిల్పాలను కాశ్మీర్లోని ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్కు అందజేసినట్లు బుద్గామ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తాహిర్ సలీమ్ ఖాన్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెలకు మూడుసార్లే స్నానం చేస్తా అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Shamna Kasim: ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న పూర్ణ?
నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్, ట్యాలెంట్.. మామూలుగా లేదుగా…
Sita Ramam: లవ్స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం ఊరమాసు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

