Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!

ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!

Samatha J
|

Updated on: Jun 20, 2025 | 6:40 AM

Share

హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. సైదాబాద్‌లో ఓ వివాహిత తన భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సైదాబాద్‌కు చెందిన అయేషా ప్రవీన్ తన భర్త గిషాన్‌ను నిద్ర మాత్రలు కలిపిన మద్యం తాగించి.. అతను మత్తులోకి జారుకున్నాక కర్రతో దాడి చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గిషాన్ పూల వ్యాపారం చేసేవాడు.

గత కొన్ని నెలలుగా అయేషా, గిషాన్ మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. అయేషా తన భర్తపై గృహహింస కేసు పెట్టగా.. గిషాన్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. జూన్ 11న రాత్రి గిషాన్ ఇంటికి వచ్చిన తర్వాత.. అయేషా అతనికి మద్యంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అతడు సోయి కోల్పోయిన తర్వాత కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అయితే జరిగిన ఘటనకు భయపడి గిషాన్‌ను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ చికిత్స పొందుతూ గిషాన్ మరణించాడు.

మరిన్ని వీడియోల కోసం :

జంట పాముల సయ్యాట..నెట్టింట వీడియో వైరల్

శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో

యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో