Palnadu: అర్ధరాత్రి ఆరుబయట పడుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. కాసేపటికే.!
కరెంట్ పోయిందని ఆ వ్యక్తి ఆరు బయట పడుకుందామని అనుకున్నాడు. దాని ప్రకారం బయటకు వచ్చి పడుకున్నాడు. చుట్టూ చిమ్మచీకటి.. ఇక సరైన సమయంలో చూసుకుని ఎవరో అతడిపై దాడికి దిగారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. ఆ వివరాలు..
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక 31 వార్డులో సినీఫక్కీలో దొంగతనానికి ప్రయత్నించి.. చివరికి వట్టి చేతులతో పరారయ్యారు. అర్ధరాత్రి కరెంట్ ఫీజు తీసి ఇంటిలోకి ప్రవేశించారు దొంగలు. కరెంట్ పోవడంతో ఇంటి యజమాని శ్రీను బయటకు రాగా.. సరైన సమయాన్ని చూసి అతడి నోరు మూసి కత్తితో దాడికి దిగారు. అయితే సదరు ఇంటి యజమాని బిగ్గరగా కేకలు వేయటంతో కారులో పరయ్యారు ముగ్గురు దుండగులు. ఈ ఘటనలో శ్రీనుకు గాయాలు అవ్వడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: May 29, 2025 06:14 PM