Telangana: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
రోజూలాగే ఆ రూట్లో ముగ్గురు వ్యక్తులు రాత్రి తమ పని ముగించుకుని ఇంటికి బయల్దేరారు. అసలే రాత్రంతా జోరున వర్షం పడుతోంది. పైగా రోడ్డు పక్కనే నది ఉగ్రరూపం దాల్చిమరీ పోటెత్తుతోంది. సరిగ్గా మార్గం మధ్యలోకి వెళ్లేసరికి.. వారికి దూరం నుంచి చిమ్మ చీకట్లో నల్లటి ఆకారాలు కనిపించాయ్.
రోజూలాగే ఆ రూట్లో ముగ్గురు వ్యక్తులు రాత్రి తమ పని ముగించుకుని ఇంటికి బయల్దేరారు. అసలే రాత్రంతా జోరున వర్షం పడుతోంది. పైగా రోడ్డు పక్కనే నది ఉగ్రరూపం దాల్చిమరీ పోటెత్తుతోంది. సరిగ్గా మార్గం మధ్యలోకి వెళ్లేసరికి.. వారికి దూరం నుంచి చిమ్మ చీకట్లో నల్లటి ఆకారాలు కనిపించాయ్. అవి చూడడానికి భారీగా ఉన్నాయి. భయం.. భయంగా వెళ్లి చూస్తే దెబ్బకు పరుగో.. పరుగు అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మొసళ్లు కలకలం రేపాయి. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని చెరువు కట్ట సమీపాన గత రాత్రి మూడు భారీ సైజ్ మొసళ్లు గ్రామస్థులకు కనిపించాయి. దీంతో చెరువు కట్టపై ప్రయాణాలు సాగించేవారు జాగ్రత్తగా వెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

