Andhra: రోడ్డు పక్కన పొదల్లో ఏవో చప్పుళ్లు.. అటుగా వెళ్తున్న ప్రయాణీకులు ఆగి చూడగా
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతవాసులకు ఎలుగుబంట్లు బెడద తప్పటం లేదు. గత కొన్నేళ్లుగా కొండలు, అడవులు అంతరిస్తుండటంతో తాగునీరు, ఆహారం కోసం అవి తరచూ అరణ్యవాసాల నుంచి జనావాసాల బాట పడుతున్నాయి. తాజాగా జిల్లాలోని మందస మండలం అంబుగాం బొడ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎలుగుబంట్లు సమీప జీడితోటల నుంచి రోడ్డుపైకి వచ్చి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళాయి. అదే సమయంలో రోడ్డుపై అటువైపుగా ప్రయాణికులు వెళ్తూ ఎలుగుబంట్లు చూసి హడలిపోయారు. ఆ రోడ్డుపై కాసేపు ప్రయాణాలు ఆగిపోగా.. కాసేపటికి ఆ ఎలుగుబంట్లు రోడ్డు వెంబడి వెళ్లి సమీప జీడి తోటల్లోకి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు . అయినప్పటికీ స్థానిక గ్రామీణ ప్రజలు ఎలుగుబంట్లు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరిపైన దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

