Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీళ్ల కన్ను మాత్రం వాటి మీదే.!
తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. దీని విలువ లక్ష వరకు ఉండొచ్చని ఆలయ పూజారి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రెండేళ్లలో ఇది ఐదవ చోరీ కావడం గమనార్హం. మరోవైపు సీబీఎస్ఈ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదని తెలిసింది. ఇన్నిసార్లు దొంగతనం జరిగినా.. పోలీసులు దొంగలను పట్టుకోకపోవడంపై.. వారి తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

