Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
2024 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మకు ఐసీసీ అరుదైన గౌరవం కల్పించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్కు రోహిత్ను టోర్నమెంట్ అంబాసిడర్గా నియమించినట్లు ఐసీసీ ప్రకటించింది. కెప్టెన్గా కప్ అందించిన 'హిట్ మ్యాన్' ఇప్పుడు ఈ మెగా టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ కొత్త బాధ్యతపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ కెప్టెన్, 2024 టీ20 వరల్డ్ కప్ విజేత రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్కు టోర్నమెంట్ అంబాసిడర్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2024లో కెప్టెన్గా కప్ గెలిపించిన హిట్ మ్యాన్, ఇప్పుడు కొత్త హోదాలో ఈ మెగా టోర్నీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ నియామకంపై ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్గా ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నాం. 2024 ప్రపంచకప్ విజేత కెప్టెన్, ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఎడిషన్లలోనూ ఆడిన రోహిత్ శర్మ కంటే ఈ ఈవెంట్కు మరో మంచి ప్రతినిధి ఉండరు అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో యువ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్, 17 ఏళ్ల తర్వాత 2024లో కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపించి కప్ అందించారు. ఆ టోర్నీలో పవర్ప్లేలో అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాపై 41 బంతుల్లో 92 పరుగులు, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై కీలక అర్ధశతకం సాధించాడు. ప్రపంచకప్ గెలిచిన వెంటనే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. కాగా, ఈ కొత్త బాధ్యతపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ మళ్లీ భారత్లో జరగడం చాలా ఆనందంగా ఉందని, బ్రాండ్ అంబాసిడర్గా కొత్త హోదాలో టోర్నీతో అనుబంధం ఏర్పరచుకోవడం గొప్ప విషయంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారు భారత ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

