Watch Video: అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం పాత బస్టాండ్లోని శివాలయంలో ఆదివారం చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయం వద్దకు వచ్చి డూప్లికేట్ తాళంతో ఆలయ గేటును తెరిచారు. అనంతరం హుండీకి ఉన్న తాళము కూడా డూప్లికేట్ తాళంతో తెరిచి, హుండీలో ఉన్న నగదును, అలాగే బీరువాలో ఉన్న 200 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు చూసి, ఆలయ పూజారికి తెలుపగా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం పాత బస్టాండ్లోని శివాలయంలో ఆదివారం చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు శివాలయం వద్దకు వచ్చి డూప్లికేట్ తాళంతో ఆలయ గేటును తెరిచారు. అనంతరం హుండీకి ఉన్న తాళము కూడా డూప్లికేట్ తాళంతో తెరిచి, హుండీలో ఉన్న నగదును, అలాగే బీరువాలో ఉన్న 200 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు చూసి, ఆలయ పూజారికి తెలుపగా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. హుండిలో అలాగే బీరువాలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హుండీలో సుమారు రూ.15,000 నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే బీరువాలో పోయిన వెండి వస్తువుల విలువ రూ.5,000 ఉండవచ్చని ఫిర్యాదులో తెలిపారు. అన్ని కలిపి ఒక రూ.20 వేల వరకు చోరీ జరిగి ఉండొచ్చని ఆలయ పూజారి పోలీసులకు తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

