AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: అయ్యప్ప దర్శనానికి అంతా రెడీ.! డిసెంబర్‌ 27న మండల పూజ..

Sabarimala: అయ్యప్ప దర్శనానికి అంతా రెడీ.! డిసెంబర్‌ 27న మండల పూజ..

Anil kumar poka

|

Updated on: Nov 17, 2023 | 7:38 PM

కేరళలో శబరిమల ఆలయం తెరుచుకుంది. నేటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 27న మండల పూజ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు జరగనున్నాయి. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు.

కేరళలో శబరిమల ఆలయం తెరుచుకుంది. నేటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 27న మండల పూజ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు జరగనున్నాయి. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు 2 నెలల పాటుజరుగుతాయి.. ఇక మకర సంక్రాంతికి కనిపించే మకర జ్యోతి కోసం దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. దీంతో సాధారణంగానే అత్యంత రద్దీగా ఉండే అయ్యప్ప క్షేత్రం.. మకర జ్యోతి సమయానికి కిక్కిరిసిపోయి ఉంటుంది. జనవరి నెలలో మకర సంక్రాతి రోజున మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఏటా లక్షలాది మంది అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు తరలివెళతారు. శబరిమల పర్యాటకుల సంఖ్య ఈ యేడాది భారీగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నుంచి కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది దేవస్థానం. దీంతో భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.