Telangana: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ.. ఏం మాట్లారడంటే..

బీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్‌ నివాసంలో కేసీఆర్‌ను ప్రవీణ్‌ కుమార్‌ కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే...

Telangana: కేసీఆర్‌తో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ.. ఏం మాట్లారడంటే..

|

Updated on: Mar 05, 2024 | 3:51 PM

బీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్‌ నివాసంలో కేసీఆర్‌ను ప్రవీణ్‌ కుమార్‌ కలిశారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య భేటీ జరగడం ఆసక్తిగా మారింది. అయితే వచ్చే పార్లమెట్ ఎన్నికల నేపథ్యంలో వీరి మధ్య జరగడం కూడా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

 

Follow us