Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్‌

Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్‌

Phani CH

|

Updated on: Oct 02, 2023 | 7:47 PM

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ ఓ బార్బర్‌ సరికొత్త మోసానికి తెరలేపాడు. అణ్వాయుధాలు, శాటిలైట్లలో వినియోగించే అద్భుత శక్తి ఉన్న రాగి చెంబు తమ వద్ద ఉందని రియల్టర్‌ను నమ్మించి కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు. హైదరాబాద్ శివారు మేడిపల్లికి చెందిన నల్లబోలు విజయ్‌ కుమార్‌ గతంలో బార్బర్‌గా పని చేసేవాడు. ఆ తర్వాత నగర శివారులో రియల్ భూం పెరగటంతో రియల్టర్‌ అవతారం ఎత్తాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ ఓ బార్బర్‌ సరికొత్త మోసానికి తెరలేపాడు. అణ్వాయుధాలు, శాటిలైట్లలో వినియోగించే అద్భుత శక్తి ఉన్న రాగి చెంబు తమ వద్ద ఉందని రియల్టర్‌ను నమ్మించి కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు. హైదరాబాద్ శివారు మేడిపల్లికి చెందిన నల్లబోలు విజయ్‌ కుమార్‌ గతంలో బార్బర్‌గా పని చేసేవాడు. ఆ తర్వాత నగర శివారులో రియల్ భూం పెరగటంతో రియల్టర్‌ అవతారం ఎత్తాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. పంజాగుట్టలోని ఓ పబ్బులో విజయ్ కుమార్‌కు పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన రియల్టర్‌ కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఆకాశం నుంచి భూమిపై పిడుగులు పడ్డప్పుడు ఏర్పడ్డ శకలాలతో తయారు చేసిన రాగి చెంబు ఉందని, దానికి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి నమ్మించాడు. తన బావమరిది సంతోశ్‌, ఐటీ ఉద్యోగి రాయుడు సాయి భరద్వాజ్‌, మౌలాలికి చెందిన సురేందర్‌లతో కలిసి నాటకం ఆడించాడు. రాగి చెంబుకు అద్భుత శక్తులు ఉన్నమాట నిజమేనని తాము స్వయంగా చూశామంటూ వారు కూడా కిరణ్‌ను నమ్మించారు. ఆ రాగి చెంబు చాలా పవర్ ఫుల్‌ అని, అది డబ్బును ఆకర్షిస్తుందని.. దానిని అమ్మాలనుకుంటున్నామని చెప్పిన వారు దాని ధర 3 కోట్లుగా చెప్పారు. కిరణ్‌ ఆ రాగి చెంబును కొనాలనుకున్నాడు. అందుకు 2021 అక్టోబరులో 50 లక్షల రూపాయలు విజయ్‌కి ఇచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??