Watch Video: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. !
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.
AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను స్లోగా ఉన్నట్లు సీఎం జగన్ చెప్పారని వెల్లడించిన బాలినేని.. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకునే క్రమంలో ఆలస్యం జరుగుతున్నట్లు సీఎంకు వివరించినట్లు తెలిపారు. అయితే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తప్పక తెలుసుకుంటానని చెప్పారు.
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

