Watch Video: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. !
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.
AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను స్లోగా ఉన్నట్లు సీఎం జగన్ చెప్పారని వెల్లడించిన బాలినేని.. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకునే క్రమంలో ఆలస్యం జరుగుతున్నట్లు సీఎంకు వివరించినట్లు తెలిపారు. అయితే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తప్పక తెలుసుకుంటానని చెప్పారు.
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
దంచి కొట్టనున్న ఎండలు.. మార్చి నుంచే ప్రారంభం!
పాతబస్తీలో మాయమవుతున్న పొట్టేళ్లు..ఏమవుతున్నాయో తెలుసా?
ఆకాశంలో అద్భుతం.. గ్రహణం వేళ బ్లడ్ మూన్ కనువిందు
హడలెత్తిస్తున్న పులి.. వణికిపోతున్న రైతులు
బీరు సీసా 'గంట'.. రామచిలుకలకు 'టాటా'

