CM YS Jagan: ఏటుకూరు సభకు హాజరైన సీఎం జగన్.. కీలక ప్రసంగం..

సత్తెనపల్లి నుంచి కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

CM YS Jagan: ఏటుకూరు సభకు హాజరైన సీఎం జగన్.. కీలక ప్రసంగం..

|

Updated on: Apr 12, 2024 | 7:09 PM

సత్తెనపల్లి నుంచి కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిశాక తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్‌ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు జగన్‌. జనసందోహం మధ్య సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఓ వైపు సభలు, మరో వైపు చేరికలు.. అంతకు మించి జనం అడుగడున సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు జనం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజకు సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీ నుంచి బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళ, ఏపీ కురవ సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్ YCPలో చేరారు.

Follow us
Latest Articles