Prajagalam Public Meeting: చిలకలూరిపేట ప్రజాగళం సభకు భారీగా హాజరైన జనం
చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజా గళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి తొలుత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి చిలకలూరిపేట సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీకి చంద్రబాబు, పవన్ స్వాగతం పలికారు.
ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట ప్రజాగళం సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. సభా వేదిక వద్దకు మోడీ చేసుకోగానే ఆ ప్రాంగణమంతా జై మోడీ.. జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్ నినాదంతో సభ దద్దరిల్లింది. పదేళ్ల తర్వాత ఏపీలో కూటమి తరపున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ, TDP, జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఇదే తొలి సభ. ఏపీలో 6 లోక్సభ స్థానాల్లో, 10 అసెంబ్లీ స్థానాల్లో BJP అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రాబోతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

