AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? పోసాని సూటి ప్రశ్న

Watch Video: చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? పోసాని సూటి ప్రశ్న

Janardhan Veluru
|

Updated on: May 01, 2024 | 11:24 AM

Share

టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా.. బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్‌షా వినలేదా? చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కరైనా ఖండించారా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు దేవుడైపోయారని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా.. బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్‌షా వినలేదా? చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కరైనా ఖండించారా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు దేవుడైపోయారని అన్నారు. జగన్‌పై దాడి చేయాలని చంద్రబాబు చెప్పారని.. అయినా చంద్రబాబుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదన్నారు. అమిత్‌షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా? అని ప్రశ్నించారు పోసాని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రబాబు బారి నుంచి జగన్‌ను కాపాడాలని కోరారు. రెండు సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని పోసాని విమర్శించారు. కేజ్రీవాల్‌ను జైలులో పెట్టిన బీజేపీ.. వేల కోట్ల ప్రజాధనం తిన్న సుజనా చౌదరీని ఎందుకు జైలుకు పంపలేదన్నారు. బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అని ప్రశ్నించారు.

Published on: May 01, 2024 11:22 AM