టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందాయంటూ ఓ ఇంగ్లిష్ పత్రికలో కథనం వచ్చిందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. గతేడాది సెప్టెంబర్లోనే ఐటీ నోటీసు ఇచ్చారని, అయినా దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పీఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆ కథనంలో ఉందన్నారు పేర్ని నాని. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబుకు ఐటీ నోటీసులందాయని చెప్పారు. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి….. చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.