Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదరగొట్టేశారుగా..
స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి శుభాకాంక్షలు చెబుతూనే కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇకపై ప్రత్యర్థులను తిట్టే ఛాన్స్ను అయ్యన్న కోల్పోయారన్నారు. ఇప్పటివరకు అయ్యన్నలో వాడివేడిని చూశారు… ఇకపై ఆయన హుందాతనాన్ని చూస్తారన్నారు పవన్ .
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. “ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా తిట్లకి, బూతులకి, కొట్లాటకు వాడితే , మనం ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములుగారి బలిదానాన్ని అవమానం చేసినట్లే..” అని పవన్ పేర్కొన్నారు. పవన్ మాటలకు ఇతర సభ్యులు బల్లాలను చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

