News Watch: ఇవాళ ఏం జరగబోతోంది..? సర్వత్రా ఉత్కంఠ..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్గూడ జైలుకి తరలించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్గూడ జైలుకి తరలించారు. అయితే.. రిమాండ్ రిపోర్ట్లో వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డిని సహా నిందితుడిగా సీబీఐ పేర్కొనడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణ హైకోర్టులో అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. నేటికి వాయిదా పడటంతో అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదేసమయంలో అవినాష్రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే.. సునీత ఇంప్లీడ్ పిటిషన్ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్పైనా విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

