Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఓల్డ్ సిటీ నీ న్యూ సిటీ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నగరం బోనమెత్తింది. అమ్మవారికి హైదరాబాద్ ఆడపడుచులు బోనాలు సమర్పించుకుంటున్నారు. నగరంలో 23 ప్రధాన ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగినప్పుడు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. NDSA నివేదికను త్వరలో బయటపెడతామన్నారాయన. కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు కోమటిరెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

