YS Jagan: ప్రభుత్వం టాబ్లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లా పామర్రులో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నది.
ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కొందరు వెనక్కి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. అలాంటి మారీచులతో తానూ యుద్ధం చేస్తున్నానని తెలిపారు. జగన్ అనే వ్యక్తి ఒక్కడు తప్పుకుంటే.. పేదలకు ఇచ్చే పథకాలన్నీ నీరుగారిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజి కార్లు ఇస్తామని కూడా ప్రచారం చేస్తారన్నారు. ఇలాంటి కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని, పేదలకోసం పనిచేసిన తనను గుర్తుపెట్టుకోవాలని కోరారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొని నిధులు విడుదలచేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయల నిధులను జగన్ విడుదల చేశారు. సీఎం జగన్ పామర్రులో బటన్ నొక్కి తల్లులు, విద్యార్ధుల జాయింట్ అకౌంట్ లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..