వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో CM రౌండ్ టేబుల్ సమావేశం
యూఏఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. లూలూ, షరాఫ్, ట్రాన్స్వర్ల్డ్ వంటి సంస్థలు లాజిస్టిక్స్, నౌకా కేంద్రం, క్యాన్సర్ సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపాయి.
యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్, విజిట్స్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ ఆల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫాలతో భేటీ అయ్యారు. లూలూ గ్రూప్, అగితా గ్రూప్, మస్దార్ సిటీ వంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి, భారత కాన్సులేట్ జనరల్ విందులో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా
OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ
ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

