వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో CM రౌండ్ టేబుల్ సమావేశం
యూఏఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. లూలూ, షరాఫ్, ట్రాన్స్వర్ల్డ్ వంటి సంస్థలు లాజిస్టిక్స్, నౌకా కేంద్రం, క్యాన్సర్ సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపాయి.
యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్, విజిట్స్లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ ఆల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫాలతో భేటీ అయ్యారు. లూలూ గ్రూప్, అగితా గ్రూప్, మస్దార్ సిటీ వంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి, భారత కాన్సులేట్ జనరల్ విందులో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా
OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ
ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

