AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTC బస్సు ఛార్జీల పెంపు పై KTR, హరీష్ రావు ఫైర్

RTC బస్సు ఛార్జీల పెంపు పై KTR, హరీష్ రావు ఫైర్

Phani CH
|

Updated on: Oct 09, 2025 | 4:46 PM

Share

బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చలో బస్ భవన్ నిరసన చేపట్టారు. ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం మోపవద్దని, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు.

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి, హరీష్ రావు మెహిదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో బస్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులపై భారం మోపవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ హయాంలో లాభాల్లో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని జగన్ హామీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిక్కిరిసిన భక్తులతో ఆలయ వీధులు

దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్‌ ఉన్నట్టా.. లేనట్టా

కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర

Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్‌ రెడీ చేసిన రాకీభాయ్‌