Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూములను కబ్జాలు చేసినవారు నాశనమైపోతారు: బాలినేని

భూములను కబ్జాలు చేసినవారు నాశనమైపోతారు: బాలినేని

Ram Naramaneni

|

Updated on: Nov 15, 2023 | 10:09 PM

భూకబ్జాలపై సిట్‌ ఏర్పాటు చేసి నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కలెక్టర్‌, ఎస్‌పిలను కోరానన్నారు బాలినేని. ఈ భూములపై ఎవరి దగ్గరా డాక్యుమెంట్లు లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరానని చెప్పారు 50 కోట్ల విలువైన ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న వారు దర్యాప్తు అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు.

ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో భూములను కబ్జాలు చేస్తున్న వారెవరైనా నాశనమైపోతారని శాపనార్ధాలు పెట్టారు మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి. భూకబ్జాలపై సిట్‌ ఏర్పాటు చేసి నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కలెక్టర్‌, ఎస్‌పిలను కోరానన్నారు. ఈ భూములపై ఎవరి దగ్గరా డాక్యుమెంట్లు లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరానని చెప్పారు 50 కోట్ల విలువైన ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న వారు దర్యాప్తు అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన పేదల భూములను తిరిగి ఇప్పిస్తానన్నారు బాలినేని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 15, 2023 10:07 PM