AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి - షర్మిల

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి – షర్మిల

Janardhan Veluru
|

Updated on: Oct 02, 2024 | 3:19 PM

Share

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లడ్డూ వివాదం, సుప్రీం వ్యాఖ్యలపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదని గుర్తుచేశారు. కల్తీ వివాదంపై ముందుగా తామే స్పందించి విచారణ కోరామని చెప్పారు. లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు.

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లడ్డూ వివాదం, సుప్రీం వ్యాఖ్యలపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదని గుర్తుచేశారు. కల్తీ వివాదంపై ముందుగా తామే స్పందించి సీబీఐ విచారణ కోరామని చెప్పారు.  ఈ విషయంపై హోం శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అలాగే ఏపీ గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేశామన్నారు. తిరుమల  లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.  తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోకూడదని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు.

Published on: Oct 02, 2024 03:19 PM