ఏపీలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేస్తారా ??

బుడమేరు వాగు విజయవాడని ఏ రేంజ్లో ఎఫెక్ట్ చేసిందో చూశాం..విజయవాడ వరదలు ఎప్పటికి మర్చిపోలేని పాఠాన్ని నేర్పించాయి. రాష్ట్రానికి అలాగే దేశానికీ కూడా. ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని ప్రకృతి గట్టి వార్నింగ్ ఇచ్చింది. వాగులు, కాలువల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేస్తూ కట్టడాలు నిర్మిస్తే.. ఇలాంటి పరిణామాలే ఉంటాయి అంటున్నారు నిపుణులు.

ఏపీలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేస్తారా ??

|

Updated on: Sep 10, 2024 | 12:01 PM

బుడమేరు వాగు విజయవాడని ఏ రేంజ్లో ఎఫెక్ట్ చేసిందో చూశాం..విజయవాడ వరదలు ఎప్పటికి మర్చిపోలేని పాఠాన్ని నేర్పించాయి. రాష్ట్రానికి అలాగే దేశానికీ కూడా. ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని ప్రకృతి గట్టి వార్నింగ్ ఇచ్చింది. వాగులు, కాలువల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేస్తూ కట్టడాలు నిర్మిస్తే.. ఇలాంటి పరిణామాలే ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఆక్రమణలకు పాల్పడితే ఫలితం ఎలా ఉంటుందో బుడమేరు వరద చూపించింది. అయితే విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా… నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం తేవడానికి రెడీ అయింది. పది రోజులు కావస్తున్నా విజయవాడ ప్రజలు వరద ముంపులోనే ఇంకా ఉన్నారు. మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే. బుడమేరు ఒకే ఒక్క రాత్రి వ్యవధిలో అంతలా ఉగ్రరూపం దాల్చదానికి కారణాలు ఏమిటని తరచి చూస్తే… మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి. జలవనరులను ఎడాపెడా ఆక్రమించడంతో.. ఇది ప్రకృతి విరుద్ధంగా ప్రవహిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఇదే సాక్ష్యం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు విష్ణుపై దారుణ ట్రోల్స్.. శివబాలాజీ ఫిర్యాదుతో పోలీస్ యాక్షన్

Bigg Boss 8 Telugu: బయటకు వచ్చిన ఏడుపు స్టార్ మణికంఠ పెళ్లి వీడియో

Stree 2: OTT డేట్ ఫిక్స్.. ఇక నవ్వుతూ భయపడేందుకు గెట్ రెడీ

TOP 9 ET News: యానిమల్ డైరెక్టర్‌తో NTR..ఏదో సంచలనం జరగబోతోందా ??

Follow us