Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ

PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ

Ram Naramaneni
|

Updated on: Jun 13, 2025 | 9:16 AM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన దగ్గర రాత్రంతా DGCA తనిఖీలు చేశారు. ఆధారాలు సేకరించడం సహా ప్రమాద తీరును విశ్లేషిస్తున్నారు అధికారులు. ఇవాళ ప్రైమరీ రిపోర్ట్ సిద్ధం చేయబోతోంది DGCA. 2 ఇంజిన్లు ఫెయిల్ అయిన కారణంగా ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. మరోవైపు ప్రమాదస్థలిని ప్రధాని మోదీ పరిశీలించారు.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడిపోవడంతో అక్కడ మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published on: Jun 13, 2025 09:16 AM