Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించండి.. ప్రధాని మోదీ పిలుపు

Ayodhya Ram Mandir: జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించండి.. ప్రధాని మోదీ పిలుపు

Janardhan Veluru

|

Updated on: Dec 30, 2023 | 5:32 PM

అయోధ్యలో దాదాపు రూ.15,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను శనివారంనాడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జనవరి 22 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అయితే ఆ రోజున ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలని సూచించారు.

అయోధ్యలో జనవరి 22న జరిగే బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజలు ఎవరూ రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లలోని దీపాలను వెలిగించి దీపావళి జరుపుకోవాలని సూచించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆ చారిత్రక రోజును ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అయోధ్యలో దాదాపు రూ.15,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను శనివారంనాడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జనవరి 22 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అయితే ఆ రోజున ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలని సూచించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజు.. అంటే జనవరి 23 నుంచి ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవచ్చని సూచించారు.

Published on: Dec 30, 2023 04:37 PM