Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…
కాకినాడ నగరంలోని వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్పోర్టు షాపు వద్ద పేలుడు సంభవించింది. హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్ను వ్యాన్ నుంచి దించి కింద పడేయగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పార్సిల్ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఓ కార్మికుడు పెద్ద పార్శిల్ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

