Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…
కాకినాడ నగరంలోని వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్పోర్టు షాపు వద్ద పేలుడు సంభవించింది. హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్ను వ్యాన్ నుంచి దించి కింద పడేయగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పార్సిల్ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఓ కార్మికుడు పెద్ద పార్శిల్ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
