Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…
కాకినాడ నగరంలోని వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్పోర్టు షాపు వద్ద పేలుడు సంభవించింది. హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్ను వ్యాన్ నుంచి దించి కింద పడేయగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పార్సిల్ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఓ కార్మికుడు పెద్ద పార్శిల్ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

