Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..

జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..

Phani CH

|

Updated on: Jun 15, 2023 | 8:56 AM

ఖైదీలకు ఇది నిజంగానే చేదువార్త. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు మాంసాహారం బంద్ అయ్యింది. పురుషుల కారాగారంతో పాటు మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. జైళ్ల శాఖలో నిధులకు కటకట ఏర్పడటంతో ఖైదీలకు మాంసాహారం..

ఖైదీలకు ఇది నిజంగానే చేదువార్త. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు మాంసాహారం బంద్ అయ్యింది. పురుషుల కారాగారంతో పాటు మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. జైళ్ల శాఖలో నిధులకు కటకట ఏర్పడటంతో ఖైదీలకు మాంసాహారం సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు 2 కోట్ల రూపాయల వరకూ జైళ్ల శాఖ బకాయి ఉన్నట్టు తెలుస్తోంది.. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్.. మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేస్‌బుక్‌ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??