Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
మొంథా తుపాను ఏపీవైపు దూసుకొస్తున్న తరుణంలో భారత వాతావరణశాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. తుపాను గమనం, తీరం దాటే విషయంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు కనిపించడం లేదన్నారు. కాకినాడ సమీపంలోనే తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని.. అలాకాని పక్షంలో తుని సమీపం వైపు లేదా నరసాపురం వైపు కొద్దిగా దిశ మార్చుకునే అవకాశముందని తెలిపారు.
ప్రస్తుతం తుపాను వాయవ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వర్షాలు తగ్గి, ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం, బంగాళాఖాతంలో ఉన్న తుపాను ఒకదానికొకటి బలం చేకూర్చుకుంటున్నాయని, అందుకే అరేబియాలో వాయుగుండం బలహీనపడకపోగా ముందుకు కదలట్లేదని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాదిలో ఉన్న వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ బంగాళాఖాతంలోని తుపానును నేపాల్ వైపు లాగుతోందని, ఇది నేపాల్ వరకు వెళ్లిన తర్వాత అరేబియాసముద్రంలోని వాయుగుండం బలహీనపడే అవకాశముందని వెల్లడించారు. నవంబరు 4 లేదా 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది భారతదేశం వైపు రాకపోవచ్చని అంచనా వేశారు. ఇది కూడా వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

