ఉగ్ర దాడులకు ప్లాన్.. ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్
గుజరాత్ ATS దేశవ్యాప్త ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. పలు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు ఐసిస్ సంబంధిత ఉగ్రవాదులను నవంబర్ 9న అరెస్ట్ చేసింది. ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చిన వీరు ఆయుధ మార్పిడికి గుజరాత్కు వచ్చారు. వీరి వద్ద పిస్తోళ్లు, క్యాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు ఏళ్ల తరబడి నిఘా ఉంచి ఈ భారీ కుట్రను ఛేదించాయి.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన.. ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) నవంబర్ 9 ఆదివారం అరెస్ట్ చేసింది. దీంతో ఉగ్రవాదులు చేసిన భారీ ఉగ్ర కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు. ఐసిస్తో సంబంధమున్న వ్యక్తులు దేశవ్యాప్తంగా దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చారు. వీరి వద్ద 3 పిస్తోళ్లు, 30 క్యాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కశ్మీర్లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేసాయి. ఉగ్రవాదులను డాక్టర్ అహ్మద్ మొహిద్దిన్ కాదర్ జిలానీ, మొహమ్మద్ సుహే మొహమ్మద్ సులేమాన్, ఆజాద్ సులేమాన్ సైఫిలుగా గుర్తించారు. ఈ ముగ్గురిపై గతేడాది నుంచి గుజరాత్ ఏటీఎస్ నిఘా ఉంచింది. వీరు ఆయుధాలు ఎక్ఛేంజ్ చేసేందుకు గుజరాత్కు వచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేశారు. వీరు రెండు ఉగ్ర సంస్థలకు చెందిన వారుగా అనుమానాలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో గుర్తించడానికి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఐదుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసారు. ఆన్లైన్లో టెర్రర్ మాడ్యూల్ను నడుపుతున్నవారితో పాటు పాక్లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు నెరపిన మహిళ కూడా వారిలో ఉంది. అంతకుముందు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో ఇద్దరు ఎస్పీఓలపై వేటు పడింది. ఉగ్ర కార్యకలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో.. విధుల నుంచి అబ్దుల్ లతీఫ్, మహ్మద్ అబ్బాస్ తొలగించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోడా జైలుకు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 60కోట్ల చిక్కుల్లో శిల్పాశెట్టి.. బిగుసుకుంటున్న కేసు
SSMB29: అత్యంత దుష్ట, క్రూర,శక్తివంతమైన నా విలన్ ఇతడే..
అతను జర్నలిస్టు కాదు..! సీరియస్ కామెంట్స్ చేసిన హీరోయిన్
తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు
TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

