Athlete protests: పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటిముందు అథ్లెట్ నిరసన..! కారణం తెలిస్తే ఒప్పుకోవాల్సిందే.. (వీడియో)
పారా అథ్లెట్స్తో సమాన హక్కులు కావాలంటూ నిరసనకు దిగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్. ఈ క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. గతంలో ఆయనకు అర్జున అవార్డు కూడా రాగా, ఆ అవార్డును,
పారా అథ్లెట్స్తో సమాన హక్కులు కావాలంటూ నిరసనకు దిగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దివ్యాంగ రెజ్లర్ వీరేందర్ సింగ్. ఈ క్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. గతంలో ఆయనకు అర్జున అవార్డు కూడా రాగా, ఆ అవార్డును, పారా క్రీడల్లో తనకు వచ్చిన పతకాలను కూడా తన నిరసన దీక్షలో ప్రదర్శించారు.
కాగా దివ్యాంగుడైన రెజ్లర్ వీరేందర్ సింగ్ నవంబరు 9న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆ మరుసటి రోజే తన పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటిముందు దీక్షకు దిగారు. బధిర క్రీడాకారులకు కూడా ఇతర పారా అథ్లెట్లతో సమానంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పారా అథ్లెట్లు అందరినీ ఒకేలా చూస్తున్నప్పుడు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమానత్వం చూపడంలేదని వీరేందర్ సింగ్ ప్రశ్నించారు. బధిర క్రీడాకారులకు కూడా సమాన హక్కులు కల్పించేంత వరకు సీఎం ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

