AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

Telangana: గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

Ravi Kiran
|

Updated on: Dec 18, 2024 | 8:15 PM

Share

ఆ రైతుకు ఓ గోశాల ఉంది. అలాగే కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి. అయితే ఒక రోజు మూడు కోళ్లు మిస్సింగ్ అయ్యేసరికి.. ఏమై ఉంటుందా అని అటుగా వెళ్లి చేశారు. ఇక అక్కడ కనిపించిన సీన్ చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇది మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగపూర్ గ్రామంలో కొండచిలువ జనావాసంలోకి రావడంతో ప్రజలు కంగుతున్నారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గోశాలలో ఇండియన్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువ దూరింది. అక్కడ ఉన్న 3 కోళ్లను తినేసింది. గమనించిన గోశాల నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన డ్యూటీలో ఉన్నా డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, బేస్ క్యాంప్ వాచ్‌మన్ దాసరి అశోక్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించారు. అనంతరం సమీప అడవిలో విడిచి పెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి