Telangana: గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
ఆ రైతుకు ఓ గోశాల ఉంది. అలాగే కొన్ని కోళ్లు కూడా ఉన్నాయి. అయితే ఒక రోజు మూడు కోళ్లు మిస్సింగ్ అయ్యేసరికి.. ఏమై ఉంటుందా అని అటుగా వెళ్లి చేశారు. ఇక అక్కడ కనిపించిన సీన్ చూసేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇది మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగపూర్ గ్రామంలో కొండచిలువ జనావాసంలోకి రావడంతో ప్రజలు కంగుతున్నారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గోశాలలో ఇండియన్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువ దూరింది. అక్కడ ఉన్న 3 కోళ్లను తినేసింది. గమనించిన గోశాల నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన డ్యూటీలో ఉన్నా డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, బేస్ క్యాంప్ వాచ్మన్ దాసరి అశోక్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించారు. అనంతరం సమీప అడవిలో విడిచి పెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

