AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమ్మగా ఉన్నాయని మైదా వంటకాలు తెగ తింటున్నారా

కమ్మగా ఉన్నాయని మైదా వంటకాలు తెగ తింటున్నారా

Phani CH
|

Updated on: May 12, 2025 | 7:13 PM

Share

కవ్వ ను ఉపయోగించి మైదా తయారు చేస్తారు. బయట మనం తినే చాలా రకాల ఆహారాల్లో మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబర్ ను పూర్తిగా తొలగించి రిఫైన్ చేసి ఈ మైదా పిండిని తయారు చేస్తారు. అందువల్ల మైదా పిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మైదా తినడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లటి విషంగా మైదాను చెబుతారు నిపుణులు. రిఫైన్ చేసిన గోధుమ పిండిలో పోషకాలు ఉండవు. ముఖ్యంగా ఫైబర్ అసలే ఉండదు. బి విటమిన్లు, థయామిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కోల్పోవలసి వస్తుందని చెబుతున్నారు. మైదా వంటకాలతో రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాను తరచు తింటూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగే ప్రమాదం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విటమిన్ బి12 లోపిస్తే చిక్కులేనా..?

చిరుతను హత్తుకుని ముద్దు పెట్టబోయింది !! ఏం జరిగిందంటే..?

తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి

కంటి దురదను వదిలించుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ !

ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ

Follow Us